ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు కీలక ఉపశమనం కలిగించింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 1 నుంచి 31 వరకు రేషన్ సరుకులు తీసుకోవచ్చని వెల్లడించింది. అలాగే రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసుకునేందుకు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు.