వేలాంకన్ని వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు జూన్ 30న ఒక అధికారిక పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది. వల్సాడ్ - వేలాంకన్ని, వేలాంకన్ని - దహాను రోడ్ మధ్య ఈ రైళ్లు నడుస్తాయని, స్లీపర్ క్లాస్ కోచ్‌లతో (Sleeper Coaches) అందుబాటులో ఉంటాయని రైల్వే యంత్రాంగం స్పష్టం చేసింది.

inline-img

రైళ్ల రాకపోకల సమయాలివే (Schedule)..
దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన అధికారిక షెడ్యూల్ ప్రకారం..
రైలు నంబర్ 09030 (వల్సాడ్ - వేలాంకన్ని స్పెషల్): జూలై 3, 2026 (శుక్రవారం) సాయంత్రం 18:25 గంటలకు వల్సాడ్ లో బయలుదేరుతుంది. ఈ సర్వీస్ మరుసటి రోజు ఉదయం 10:00 గంటలకు వేలాంకన్ని చేరుకుంటుంది.
రైలు నంబర్ 09029 (వేలాంకన్ని - దహాను రోడ్ స్పెషల్): తిరుగు ప్రయాణంలో ఈ రైలు జూలై 6, 2026 (సోమవారం) తెల్లవారుజామున 00:30 గంటలకు వేలాంకన్నిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10:30 గంటలకు దహాను రోడ్ చేరుకుంటుంది.
ప్రధాన స్టాపింగ్స్ వివరాలు..
ఈ ప్రత్యేక రైళ్లు మహారాష్ట్ర పరిధిలోని దహాను రోడ్, పాల్ఘర్, వసాయ్ రోడ్, పన్వేల్, లోనావాలా, పుణే, దౌండ్, సోలాపూర్ స్టేషన్లలో ఆగుతాయి.
ఆ తర్వాత కర్ణాటక పరిధిలోని కల్బురగి, వాడి, యాద్గిర్, కృష్ణ, రాయచూర్ మీదుగా ప్రయాణించి.. ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి ప్రవేశించి మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.
అక్కడి నుండి తమిళనాడు పరిధిలోని కాట్పాడి, వెల్లూర్ కాంట్, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుప్పాదిరిపులియూర్, చిదంబరం, మైలాడుతురై, తిరునల్లారు, కారైకాల్, నాగూర్, నాగపట్నం స్టేషన్లలో ఈ రైళ్లకు స్టాపింగ్స్ కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
Read latest India News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 10 Jul 2026 | 12:46 PM IST
Tags: