తెలంగాణ ప్రజాప్రతినిధుల బృందంతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమావేశమై రాష్ట్రంలోని రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక చర్చలు జరిపారు. ఆదిలాబాద్ - ఆర్మార్ కొత్త రైల్వే లైన్ డీపీఆర్ పూర్తయిందని, త్వరలోనే ఆమోద ప్రక్రియకు వెళ్తుందని తెలిపారు. అలాగే హైదరాబాద్‌ను ప్రధాన ‘హైస్పీడ్ రైల్ హబ్’గా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.