యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం నాడే భక్తుల సందడితో కిక్కిరిసిపోయింది. సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం భారీగా తరలివచ్చి క్యూలైన్లలో బారులు తీరారు.

క్యూలైన్లలో బారులు.. గంటల సమయం

స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు గంట సమయం పడుతోంది. భక్తులు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ఆర్జిత పూజల్లో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.

అధికారుల పర్యవేక్షణ

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు నిరంతరం దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 26 Jul 2026 | 01:50 PM IST
Tags: