న్యూఢిల్లీ: కేంద్ర రాజకీయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 క్లాజ్ (2) ప్రకారం ఆయన రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదించారు.
ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం, విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర కేబినెట్ మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న శాఖలతో పాటు విద్యాశాఖ అదనపు బాధ్యతలను కూడా చూడాల్సిందిగా ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన
ఈ మేరకు రాష్ట్రపతి ఉప ప్రెస్ కార్యదర్శి నవికా గుప్త అధికారిక విలేకరుల ప్రకటన (Press Communique) విడుదల చేశారు. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని సదరు ప్రకటనలో పేర్కొన్నారు.


