కొల్లాపూర్: మండల పరిధిలోని కుడికిల్ల గ్రామంలో భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి నీటి ఎద్దడి కలగకుండా ఉండేందుకు నూతనంగా అదనపు బోరు వేయించారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరుడు, కుడికిల్ల గ్రామ సర్పంచ్ జూపల్లి రఘుపతిరావు స్వయంగా పర్యవేక్షించి ఈ బోరును తవ్వించారు.
తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి
గ్రామంలో నిరంతరం పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా, ముఖ్యంగా రాబోయే వేసవి కాలంలో తాగునీటి కొరత తలెత్తకుండా ఉండేందుకే ముందస్తు ప్రణాళికతో అదనపు బోరు వేయించినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంటికీ నిరంతరం తాగునీరు అందించడమే తమ ప్రథమ బాధ్యత అని, భవిష్యత్తులో నీటి సమస్య అనేదే రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
మంచినీటి సమస్యకు ముందస్తుగానే పరిష్కారం చూపిన సర్పంచ్ జూపల్లి రఘుపతిరావుకు కుడికిల్ల గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మల్లేష్ యాదవ్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పురప్రముఖులు పాల్గొన్నారు.


