నందిగామ: షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగామ మండలం సీడీ తాండ గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీజేఐఐసీ (TJIIC) నిధులు రూ.12 లక్షల వ్యయంతో ఇక్కడ కొత్తగా సీసీ రోడ్డును నిర్మించనున్నారు.
ఈ నూతన రహదారి నిర్మాణ పనులకు సర్పంచ్ గబ్రు చౌహన్ వార్డు సభ్యులతో కలిసి అధికారికంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక కృషితో నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
గత కాలంతో పోలిస్తే ప్రస్తుతం పల్లెల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు లాంటి మౌలిక వసతుల పెంపునకు ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోందని ఆయన వివరించారు. సీడీ తాండ సర్వాంగ సుందరంగా మారేందుకు ఎమ్మెల్యే నిరంతరం సహకరిస్తున్నారని కొనియాడారు.


