బిజినెస్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో మరోసారి డిస్కౌంట్ల పండుగకు తెరలేపింది. ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించే 'ప్రైమ్ డే 2026' సేల్ జూలై 4 అర్ధరాత్రి నుండి అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. జూలై 6 అర్ధరాత్రి వరకు సుమారు 72 గంటల పాటు ఈ మెగా సేల్ కొనసాగనుంది. భారత మార్కెట్లో ప్రైమ్ డే సేల్స్ ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి గ్యాడ్జెట్లపై కంపెనీ భారీ ఆఫర్లను ప్రకటించింది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ షురూ
అమెజాన్ ప్రతిష్టాత్మక 'ప్రైమ్ డే 2026' సేల్ భారత్లో అధికారికంగా ప్రారంభమైంది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా సహా పలు అగ్రశ్రేణి స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

బ్యాంక్ ఆఫర్లతో అదనపు తగ్గింపు
ఈ సేల్లో భాగంగా కొనుగోలు చేసే వినియోగదారులకు ఎస్బీఐ (SBI), యాక్సిస్ (Axis) బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వాడే వారికి 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఎంపిక చేసిన కొన్ని ప్రొడక్టులపై 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కల్పించారు.
స్మార్ట్ఫోన్లపై క్రేజీ డీల్స్
టాప్ బ్రాండ్ల ప్రీమియం, బడ్జెట్ ఫోన్లపై లభిస్తున్న ప్రధాన ఆఫర్లు ఇవే:
శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా: లాంచింగ్ ధర రూ.1,29,999 ఉన్న ఈ ప్రీమియం ఫోన్ ప్రైమ్ డే సేల్లో ఏకంగా రూ.84,999 కే లభిస్తోంది. దీనిపై రూ.66,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ: ఈ సరికొత్త మోడల్ ఎస్25 ఎఫ్ఈ అత్యంత తక్కువ ధరగా రూ.44,999 కే అందుబాటులో ఉంది.
ఐకూ (iQOO) సిరీస్: ఐకూ జెడ్11ఎక్స్ ఫోన్ రూ.19,999 ధరకే లభిస్తుండగా, ఐకూ నియో 10 ధర రూ.38,999 గా ఉంది. ప్రీమియం మోడల్ ఐకూ 15ఆర్ రూ.45,999 కు, ఐకూ 15 మోడల్ రూ.71,999 ప్రారంభ ధరలతో సేల్లో ఉన్నాయి.
బడ్జెట్ ఫోన్లు: రెడ్మీ 15 5జీ ఫోన్ రూ.24,498 కే లభిస్తుండగా, శామ్సంగ్ గెలాక్సీ ఏ17 5జీ ఫోన్ రూ.24,499 ధరకు అందుబాటులోకి వచ్చింది. రెడ్మీ ఏ7 ప్రో ఫోన్ ప్రారంభ ధర రూ.12,999 గా ఉంది.
ఆడియో, ల్యాప్టాప్లు, ఇతర గ్యాడ్జెట్లు
ప్రీమియం ఆడియో బ్రాండ్ జెన్హైజర్ (Sennheiser) మొమెంటం టీడబ్ల్యూఎస్ 4 ఇయర్బడ్స్ 40 శాతం తగ్గింపుతో రూ.17,990 కే లభిస్తున్నాయి. స్టూడియో మానిటర్ హెడ్ఫోన్స్ హెచ్డీ 490 ప్రో ప్లస్ ధర రూ.27,999 గా ఉంది. స్మార్ట్ వేరబుల్స్ విభాగంలో 'ఓరా రింగ్ 4' (Oura Ring 4) పై ఇండియాలో ఇప్పటివరకు లేనంతగా 30 శాతం వరకు భారీ డిస్కౌంట్ ప్రకటించారు.
వీటితో పాటు హెచ్పీ విక్టస్ గేమింగ్ ల్యాప్టాప్ బ్యాంక్ డిస్కౌంట్లతో కలిపి రూ.78,990 ధరకే లభిస్తోంది. షియోమీ ప్యాడ్ 8 టాబ్లెట్ రూ.29,999 కే అందుబాటులో ఉంది. స్మార్ట్ టీవీల విభాగంలో సోనీ బ్రావియా 3 సిరీస్ 4కే గూగుల్ టీవీ రూ.62,990 ధరకు, శామ్సంగ్ విజన్ ఏఐ స్మార్ట్ మినీ ఎల్ఈడీ టీవీ అత్యంత తక్కువగా రూ.38,990 కే లభిస్తున్నాయి. సరికొత్త గ్యాడ్జెట్లు కొనుగోలు చేయాలనుకునే టెక్ ప్రియులకు ఈ మూడు రోజుల సేల్ మంచి అవకాశంగా నిలవనుంది.
Read latest Business News and Telugu News
Updated: 10 Jul 2026 | 12:46 PM IST

