హైదరాబాద్: తెలంగాణ ప్రణాళికా శాఖ (Planning Department) ఆధ్వర్యంలో మంగళవారం (జూలై 21) రాజధాని హైదరాబాద్లోని రవీంద్రభారతి వేదికగా ఒక ముఖ్యమైన సదస్సు నిర్వహించబడుతోంది. "ఎల్ నినో: ఫసిఫిక్ వార్మింగ్ టు తెలంగాణ ప్రిపేర్డ్నెస్" (El Nino: From Pacific Warming to Telangana Preparedness) అంశంపై ఈ ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేశారు.
ఉదయం 10.30 గంటలకు ప్రారంభం
రవీంద్రభారతిలో ఉదయం 10.30 గంటలకు ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఎల్ నినో ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే మార్పులు, దానివల్ల తెలంగాణలో రుతుపవనాలు, వర్షపాతం, వ్యవసాయం మరియు నీటి వనరులపై పడే ప్రభావాలు.. వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించనున్నారు.
హాజరుకానున్న రాష్ట్ర ముఖ్య నేతలు
ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి (డిప్యూటీ సీఎం), వివిధ శాఖల మంత్రులు, శాసనసభ్యులు (MLAs), శాసనమండలి సభ్యులు (MLCs) మరియు ప్రణాళికా శాఖ ఉన్నతాధికారులు, నిపుణులు హాజరుకానున్నారు.


